కామారెడ్డి : బాన్సువాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థినులకు రుచికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూంలోని ఆహార పదార్థాలను, సరుకులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ప్రిన్సిపాల్ను మందలించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.