కామారెడ్డి : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమిసోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని స్పీకర్ తెలిపారు. కాగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు.