నిజామాబాద్ : తన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాలయ నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. దేవాదాయ దర్మాధాయ శాఖ సహకారంతో రూ.50 లక్షలతో ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
శ్రీరాముడు అందరికీ ఆదర్శం. రాముని సుగుణాలను అందరూ ఆచరించాలన్నారు. సీతమ్మ గొప్ప మహిళ. ఆలయం నిర్మాణం గొప్ప ఆశయం. స్వచ్ఛమైన మనస్సుతో పూజిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు. భక్తి లేని పూజ వ్యర్థం. ప్రపంమంతటా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. యుద్దాలు, అశాంతి జరగకుండా అంతటా శాంతి ఉండాలి అని స్పీకర్ పేర్కొన్నారు.