Monsoon | హైదరబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదల్లేదు. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయాయి.
ఈపాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. రుతుపవనాలు కదలకపోవటంతో పలు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలో ఈ నెల 20 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది.