హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కొల్లం, కొట్టాయం మధ్య వీటిని నడుపుతామని అధికారులు తెలిపారు. ఏయే తేదీల్లో రైళ్లు అంటుబాటులో ఉంటాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయనే వివరాలను ప్రకటించారు.
హైదరాబాద్-కొల్లం (నం.07133) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9, 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లం-హైదరాబాద్ (నం.07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ మీదుగా వెళ్తుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (నం. 07125): డిసెంబర్ 4,11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం-సికింద్రాబాద్ (నం.07126) మధ్య డిసెంబర్ 5, 12, 19, జనవరి 2, 9 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు మీదుగా వెళ్తుంది.
నర్సాపురం-కొట్టాయం (నం. 07119) డిసెంబర్ 2,9,16,30, జనవరి 6,13వ తేదీలలో తిరగనుంది. కొట్టాయం-నర్సాపురం (నం. 07120) డిసెంబర్ 3,10,17,31వ తేదీలతో పాటు జనవరి 7,14వ తేదీలలో నడవనుంది. ఇది పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరుతో పాటు ప్రాధాన స్టేషన్లలో ఆగుతుంది.