హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జనవరిలో పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ పండుగ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ నుంచి తమ సొంత ఊర్లకు ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లే అవకాశాలు ఉండడంతో మొత్తం 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే జనవరి 3 నుంచి 20 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయన్నారు.
మచిలీపట్నం – కర్నూల్ సిటీ, కర్నూల్ సిటీ – మచిలీపట్నం, కాకినాడ టౌన్ – లింగంపల్లి, లింగంపల్లి – కాకినాడ టౌన్, మచిలీపట్నం – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – మచిలీపట్నం, మచిలీపట్నం – తిరుపతి, తిరుపతి – మచిలీపట్నం, విజయవాడ – నాగర్సోల్, నాగర్సోల్ – విజయవాడ, పూర్ణ – తిరుపతి, తిరుపతి – పూర్ణ, తిరుపతి – అకోలా, అకోలా – తిరుపతి, సికింద్రాబాద్ – కటక్, కటక్ – సికింద్రాబాద్, నాదేండ్ – బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ – నాందేడ్, నాందేడ్ – యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ – నాందేడ్, హైదరాబాద్ – యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ – హైదరాబాద్, సికింద్రాబాద్ – యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.