Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనుండగా.. మరికొన్ని తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనున్నాయి. సికింద్రాబాద్ నుంచి చాప్రా, ధర్బంగా, ముజఫర్నగర్కు.. నాంపల్లి నుంచి పాట్నా, మహబూబ్నగర్ నుంచి గోరఖ్పూర్కు ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రత్యేక రైళ్లను వినియోగించాలని దక్షిణమధ్య రైల్వే సూచించింది.