హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సమ్మర్ స్పెషల్ పేరిట మరో 20 ప్రత్యేక రైళ్లు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు నడువనున్నాయి.
సికింద్రాబాద్-ముజాఫర్పూర్, మహబూబ్నగర్-గోరఖ్పూర్, బెంగుళూరు- ఖరగ్పూర్, భువనేశ్వర్- యలహంకా, హుబ్లీ-గోమతినగర్, జబల్పూర్-కన్యాకుమారి, సూరత్-బరంపూర్ మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుస్తాయి.