నవీపేట, జనవరి 28: పిల్లనిచ్చిన మామ వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారులోని ఉప్పుగూడకు చెందిన అర్దం సందీప్కుమార్ (31)కు నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన యువతితో రెండున్నరేండ్ల క్రితం వివాహమైంది. విస్త్తరాకులు, బ్రెడ్ల వ్యాపారం నిర్వహిస్తున్న సందీప్కుమార్కు మామ ఓ ఫైనాన్స్లో రూ.5 లక్షలు ఇప్పించాడు.
మొదట్లో ఈఎంఐలు సక్రమంగా చెల్లించిన సందీప్కుమార్ వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నెల 26న నిజామాబాద్లో జరిగిన మరదలు పెండ్లికి తన భార్యతో కలిసి సందీప్కుమార్ హాజరయ్యాడు. అప్పు తీర్చాలంటూ మామ బంధువుల సమక్షంలో అల్లుడిని నిలదీశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్కుమార్ ఈ నెల 27న ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి యంచ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు మామ దేవేందర్పై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.