పాలకుర్తి / జనగామ : సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనాన్ని వేడుకగా నిర్వహించారు. ప్లవ నామ సంవత్సర ఉగాది, అనుభవమంటప అధ్యక్షుడు అల్లమ ప్రభు జయంతి సందర్భంగా జిల్లాలోని పాలకుర్తికి చెందిన సోమనాథ కళా పీఠం గూగుల్ మీట్ వేదికగా కవి సమ్మేళనం నిర్వహించింది. డాక్టర్ రాపోలు సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ సెనేట్ సభ్యుడు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డాక్టర్ శంకరమంచి శ్యామ్ ప్రసాద్, గుండు రవి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. శంకరమంచి సాయి సృజన్, రాపోలు సోం సాయి సాంకేతిక సహకారం అందించారు. కవిసమ్మేళనంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా పలు రాష్ట్రాలు, విదేశాలనుంచి 45 మంది కవులు కవితా గానం చేసారు.
కార్యక్రమంలో వనపట్ల సుబ్బయ్య, జనగామ శంకర్, ఎల్లంభట్ల విజయ్ కుమార్, బూర్ల
వెంకటేశ్వర్లు, మోకాటి రాంబాబు, ఎల్లంభట్ల నాగయ్య, సబ్బని లక్ష్మీనారాయణ,
మార్గం సాయి సందీప్ తేజ, రాపోలు సోమ్ సాయి, మామిండ్ల రమేశ్ రాజా, గూడూరు
లెనిన్, అనంతోజు సోమయ్య, రాపోలు శోభా రాణి, తమ్మి దిలీప్ కుమార్, ఇమ్మడి
దామోదర్, మార్గం లక్ష్మీనారాయణ, పోతుగంటి నర్సయ్య, వీరమనేని వరుణ్ రావు,
ఇమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న కవులందరికి ఈ
మెయిల్ ద్వారా ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ