హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎస్ జవహర్రెడ్డిని గురువారం కలిసి జాయినింగ్ రిపోర్ట్ ప్రక్రియ పూర్తిచేశారు. అనంతరం సీఎం జగన్తో సోమేశ్కుమార్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన భేటీలో తాజా పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. తనకు అప్పగించే బాధ్యతల్లో కొనసాగాలని సోమేశ్ భావిస్తున్నట్టు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సోమేశ్కుమార్ నిరాకరించారు.