అమ్రాబాద్, మే 14: అనుమతి లేకుండా కొందరు రైడర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లగా అటవీ అధికారులు గుర్తించి జరిమానా విధించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో చోటుచేసుకున్నది. మద్దిమడుగు రేంజ్ అధికారి ఆదిత్య కథ నం మేరకు.. హైదరాబాద్కు చెందిన 16 మంది బైక్ రైడర్లు శనివారం మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శించుకొన్నారు.
అనంతరం సమీపంలోని కృష్ణానది వద్ద ఉన్న సోమచెలకలు చేరుకొని అక్కడ టెంట్ వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని రైడర్లను అదుపులోకి తీసుకున్నారు. 16 బైక్లను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అడవిలోకి వెళ్లినందుకు ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల చొప్పు న మొత్తం రూ.2.40 లక్షల జరిమానా వసూలు చేసినట్టు మద్దిమడు గు రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు.