హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పర్యాటక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను కోరారు. రాజేందర్ శనివారం ఆయనను కలిసి పలు విషయాలను చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, కొవిడ్ సందర్భంగా కోత విధించిన జీతాలను వెంటనే ఇవ్వాలని కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ త్వరలో నిర్వహించే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై చర్చించి, ఆమోదించేలా చూస్తామన్నారు. గుప్తాను కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కార్యనిర్వాహక కార్యదర్శి కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.