హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. దీనికోసం రూ.283 కో ట్ల వ్యయం అవుతుందని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీనికి ఆమోదం లభిస్తే మరో రెండు నెలల్లో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలన్నింటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతాయి. 4,600 హైస్కూళ్లు, 475 కేజీబీవీలు, 192 మాడల్ స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి తరగతి గదికి లైట్లు, ఫ్యాన్లు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున కంప్యూటర్ ల్యాబ్లను నెలకొల్పారు. డిజిటల్ విద్య కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను ఏర్పా టు చేశారు. దీంతో విద్యుత్తు వినియోగం అధికమై బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో బిల్లల భారం నుంచి బడులను బయట పడేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
అమలు ఇలా..
సోలార్తో తొలగనున్న సర్కార్ స్కూళ్ల ఇబ్బందులు
మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖలను మార్చేస్తున్నాం. 12 అంశాలను తీసుకొని అభివృద్ధి చేస్తున్నాం. 13వ అంశంగా సోలార్ విద్యుత్తు ప్లాంట్లను బడుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 1,500కు పైగా బడుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయ్యింది. ప్లాంట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదే తరహాలో మరికొన్నింటిలోనూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. వీటి ఏర్పాటుతో సర్కారు స్కూళ్ల ఇబ్బందులు తొలగిపోతున్నాయి. – సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి