హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ జగన్మోహన్ రెడ్డి దుర్మరణం చెందాడు. బైకును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ ఆగకుండా వెళ్లింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో నగర శివార్లలోని ఎల్బీ నగర్ అండర్ పాస్లో ఓ కారు బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ రింగ్రోడ్డు వైపునుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అండర్ పాస్లో బోల్తా కొట్టింది. అయితే ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును అక్కడి నుంచి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అంచనావేస్తున్నారు.