దేవేందర్ గౌడ్
నవతెలంగాణ పార్టీ పెట్టి నామరూపాలు లేకుండ పోయిండు
నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్ష్యతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రాభవం కోల్పోయాడు
ప్రొఫెసర్ కోదండరాం
కేసీఆర్ సహకారంతో జేఏసీ చైర్మన్ గా ఎన్నికై, కేసీఆర్ ఆదరించినా విస్మరించి, కాంగ్రెస్ మ్యానిఫెస్టో రాసి సొంతంగా పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ పెట్టి పోటీకి వెళ్తే జనాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ కాదు పొమ్మంది. వెంట నడిచిన చెరుకు సుధాకర్, చింతపండు నవీన్, రచనారెడ్డిలు దూరమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వారే ఆయనకు వ్యతిరేకంగా నిలిచారు
మాజీ ఎంపీ వివేక్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటనడిచి తెలంగాణ రాగానే కాంగ్రెస్ లకు జంప్ చేసి, అధికారం రాకపోయే సరికి తిరిగి టీఆర్ఎస్ లో చేరి అవకాశం దక్కకపోయే సరికి బీజేపీ జెండా ఎత్తుకున్నడు. పదవి కోసం ఎక్కని గడప లేదు. మొక్కని మొక్కు లేదు
చెరుకు సుధాకర్
తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఎమ్మెల్యే టికెట్ రాలేదని కేసీఆర్తో విభేదించి సొంతంగా నిలబడి ఓడిపోయి, ఇంటి పార్టీ పెట్టినా జనం ఆదరించలేదు. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
చింతపండు నవీన్ కుమార్
ఉద్యమ సమయంలో వచ్చిన ఆదరణను చూసి వాపును బలుపు అనుకొని చట్టసభలో పదవి ఆశించాడు. కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయి కేసీఆర్ మీద విషం కక్కడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ను వీడి కోదండరాం పార్టీలో చేరి రెడ్ల పార్టీ అని సొంత యూట్యూబ్ చానల్ పెట్టి తలతిక్క తనానికి జర్నలి జం అని పేరు పెట్టి వెర్రివాళ్లను నమ్ముకుని మరోసారి సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగాడు. ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలిసిందే
ఏపూరి సోమయ్య
కేసీఆర్ సామాజికవర్గాన్ని ముందుపెట్టి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వదిలేసి ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అంటూ ఎర్రిపాటలు రాసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పైకి తుపాకీ గురిపెట్టిన ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి వెంట నడిచాడు. రేవంత్ తెలంగాణ సమాజాన్ని ముం దుకు నడపాలని స్టేజీ మీద పాటలు పాడి, మాటలు చెప్పి సరిగ్గా నెల తిరగక ముందే ఇప్పుడు షర్మిల పార్టీల చేరాడు.
రవీంద్ర నాయక్ అయినా
ఎ చంద్రశేఖర్ అయినా
స్వామిగౌడ్ అయినా
రాములు నాయక్ అయినా
కపిలవాయి దిలీప్ కుమార్ అయినా
విజయశాంతి అయినా
దాసోజు శ్రవణ్ అయినా
ప్రతాప్ రెడ్డి అయినా
బొడిగె శోభ అయినా
రాణి రుద్రమ అయినా
ఏపీ జితేందర్ రెడ్డి అయినా
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయినా
ఈటల రాజేందర్ అయినా
ఎల్లయ్య.. మల్లయ్య.. పుల్లయ్య
ఎవరయినా
వారి ఆలోచన పదవి కోసం మాత్రమే
తెలంగాణ సమాజం మీద ప్రేమ కాదు
తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ది కాదు
పదవి కోసమే వారి జెండా
అధికారమే వారి ఎజెండా
పదవి ఇస్తే కేసీఆర్ దేవుడు
పదవి ఇవ్వకుంటే కేసీఆర్ దయ్యం
పదవి దక్కితే తోకలూపుతారు
పదవి దక్కకుంటే విషం చిమ్ముతారు
అందుకే వీళ్లను కేసీఆర్
ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు
ఎక్కడికి నెట్టాలో అక్కడికి నెట్టారు
ఎవరున్నా, ఎవరు పోయినా
ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా
కేసీఆర్ లక్ష్యం
అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర
సర్వతోముఖాభివృద్ధి
జై తెలంగాణ..! జై కేసీఆర్..!!
(సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్)