శంషాబాద్ రూరల్, జూన్ 6: మలద్వారంలో దాచుకొని బంగారం తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారంలో ఆరు క్యాప్యూళ్లను దాచిపెట్టి బ్లాక్టేపులో చుట్టిన బంగారం పేస్టును తీసుకొచ్చినట్టు గుర్తించారు. వారి నుంచి స్వాధీనం చేసుకొన్న 1,705.3 గ్రాముల బంగారం విలువ రూ.1,05,21,701 ఉంటుందని అధికారులు తెలిపారు.