హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్లో నిలిపి వేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది వాకీటాకీ ద్వారా లోకో పైలట్కు సమాచారం ఇచ్చి, స్టేషన్లో నిలిపివేయగానే.. భయంతో ప్రయా ణికులు కిందకు దిగారు.
మూడో బోగీలోని బాత్రూమ్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. కాల్చి పడేసిన సిగరెట్ ముక్క వల్లే పొగ వ్యాపించిందని నిర్ధారించారు. బాధ్యుడైన టికెట్ లేని ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.