బీబీనగర్/కాగజ్నగర్: ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రేక్ పట్టీలు పట్టేయడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన లోకో పైలెట్ రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అధికారులు పొగలను అదుపు చేసి దాదాపు 20 నిమిషాలపాటు మరమ్మతులు చేశారు. ఆ తరువాత రైలు బయల్దేరి వెళ్లింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.