East Coast Express | వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పట్టాలు తప్పడం, రైళ్లలో పొగలురావడం వంటి ఘటనలతో కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో రైలులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. అయితే, బ్రేక్లైన్ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది సంఘటనా చేరుకొని మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట తర్వాత రైలు మళ్లీ బయలుదేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.