Train | సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు బీబీనగర్ స్టేషన్లో రైలును నిలిపివేశారు.
రైలు ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే దానికి మరమ్మతులు చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత రైలు యథావిధిగా బయలుదేరింది. కాగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.