హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బాల్యం స్మార్ట్ఫోన్లో బందీ అవుతున్నది. పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఏ ఇంట్లో చూసినా పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లలోనే మునిగి తేలుతున్నారు. ఫోన్లకు బానిసలుగా మారి చిన్నచిన్న విషయాలకే విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. 1-12 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తున్నది. ఆటపాటలు లేవు.. తోటి పిల్లలతో ఆడుకోవడాలు లేవు.. ఎంతసేపూ ఫోన్లో వీడియోలు చూస్తూ పొద్దు పుచ్చుతున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకొంటున్నారు. అల్లరి ఆపాలనో, ఇతర ఏ కారణంతోనో పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్లు చూడటం అలవాటు చేస్తున్నారు. తాత్కాలికంగా పిల్లల ఈ చేష్టలు ముద్దుగా అనిపించినా స్మార్ట్ఫోన్ల అతివినియోగ తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుందని మానసిక వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగం పిల్లల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నది అన్నదానిపై ప్యూ, ఫ్యామిలీ హెల్త్ తదితర సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
స్మార్ట్ఫోన్ అతివినియోగంతో అనర్థాలు
నివారణ మార్గాలు..
వివిధ సర్వేల్లో తేలిన అంశాలు