హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 19 నుంచి 23 వరకు జాతీయ స్థాయిలో ఈ గ్రాండ్ ఫినాలే జరుగనున్నది.
ఈ హ్యాకథాన్కు జాతీయంగా 48 నోడల్ కేంద్రాలు కాగా, తెలంగాణలో నాలుగు నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్పేస్ టెక్నాలజీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రోబోటిక్స్, డ్రోన్లు, హెరిటేజ్ అండ్ కల్చర్ మొదలైన థీమ్లపై విద్యార్థులు పరిష్కారాలను చూపించారు. ఈ గ్రాండ్ ఫినాలేకు 1,282 బృందాలను షార్ట్లిస్ట్ చేశారు.