హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై విచారణను అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేశాయి. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు ఒక పిటిషన్ వేయగా, ఆయనను మరో మూడురోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. వీటిలో ఏ పిటిషన్పై ముందుగా విచారణ జరపాలని అంశంపై చంద్రబాబు, సీఐడీ తరఫు న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఈ సమయంలో ఏ పిటిషన్పై ముందుగా విచారణ జరపాలో తమకు తెలుసునని ఏసీబీ కోర్డు జడ్జి అసహనం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ జరుపాలని తమపై ఒత్తిడి చేయరాదని హెచ్చరించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు ఆర్డర్స్ ఇస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఏ అంశంపై విచారణ చేపట్టాలో మంగళవారం తేలుస్తామని అన్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్..
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు లాయర్లు సు ప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. క్వాష్ పిటిషన్ను అత్యవసరం గా విచారణకు స్వీకరించాలని వాదించారు. చంద్రబా బు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ జ స్టిస్ చంద్రచూడ్ అడిగారు. సెప్టెంబర్ 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని లుథ్రా తెలిపారు. కేసు వివరాలు చెప్పేందుకు లూథ్రా ప్రయత్నించారు. మంగళవారం మరోసారి మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని, అన్ని విషయాలు రేపే వింటామని సీజేఐ తెలిపారు.