హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : 2020-21 విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లకు సైబర్ సెక్యూరిటీలో ఆరునెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా వెనకబడిన తరగతుల శాఖ అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నది. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ డిగ్రీతో పాటు ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.5 లక్షలు, అర్బన్ ప్రాంతాలలో రూ. 2 లక్షలు ఉండాలి. ఈ నెల 8లోపు జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారికి దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాలకు 040-23399094 నంబర్ను సంప్రదించాలి.