హైదరాబాద్ : సలేశ్వరం జాతరలో అపశ్రుతి చోటు చేసుకున్నది. కొండల పైనుంచి రాళ్లు జారిపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లమల అడవుల్లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసింది. వానతో కొండలపై నుంచి గుండంలో బండరాళ్లు జారిపడ్డాయి. రాళ్లు దొర్లిపడడంతో ఆరుగురు భక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. అటవీ శాఖ ఆంక్షల మధ్య నల్లమల అభయారణ్యంలో సలేశ్వరం యాత్ర శుక్రవారం ప్రారంభమైన విషయం విధితమే. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమలలో దట్టమైన అటవీ ప్రాంతంలో భూమికి ఆరు కిలోమీటర్ల లోయలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా సలేశ్వరం యాత్ర నిలిపివేయగా.. ఈ సారి లింగమయ్య దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా, ఆదివారంతో సలేశ్వరం జాతర ముగిసింది.