నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అక్రమాస్తుల కేసులో హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటీషన్ను ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ సోమవారం కొట్టివేశారు. ఈ కేసులో సా క్షులుగా కొందరు ఐఏఎస్ అధికారులను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
శివబాలకృష్ణ కస్డోడియల్ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో ఆయనతోపాటు మరికొందరు ఐఏఎస్లకు సీఆర్పీసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.