Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ సిట్ అధికారులు ఇకపై సోషల్ మీడియా వారియర్స్పై దృష్టి సారించనున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, అబద్ధపు హామీలను ఎత్తిచూపుతున్న వారియర్స్ దాడికి తట్టుకోలేక వారిని సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ప్రయత్నం మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఇటీవలే సోషల్ మీడియా కేసుల కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది రేవంత్ ప్రభుత్వం. కానీ, అడ్డగోలుగా కేసులు పెట్టడానికి వీలు లేదని, సుప్రీం ధర్మాసనం వారంలో రెండుసార్లు మొట్టికాయలు వేయడంతో మింగుడు పడక కొత్త ఎత్తుగడ వేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అగ్రెసివ్గా పోస్టులు పెడుతున్న కొందరికి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంటూ సిట్ అధికారులు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు.
సోషల్ మీడియా వారియర్స్కు ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులు!
సోషల్ మీడియా దాడికి తట్టుకోలేక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరిట ఇరికించే ప్రయత్నం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి
ఇటీవలే సోషల్ మీడియా కేసుల కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్ళగా అడ్డగోలుగా కేసులు పెట్టడానికి వీలు లేదని, సుప్రీం…
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2026