నాంపల్లి కోర్టులు, మే 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది. రెండు, మూడో ర్యాంకులు సాధించిన శాంతి, పురేందర్ నూతన్ రాహుల్కుమార్తో పాటు అట్ల సుచరితారెడ్డిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కృష్ణయ్య కోర్టును కోరారు. రమావత్ దత్తుతో పాటు తర్వాతి నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సుచరితారెడ్డి తరఫు న్యాయవాది మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశారు. కస్టడీకీ ఇవ్వొద్దని, ఇప్పటీకే విచారణ పూర్తయిందని తెలిపారు. జువెనైల్ కోర్టు మెజిస్ట్రేట్ జీ రాధిక తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. పధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజేశ్వర్రెడ్డితో వీరికు న్న లావాదేవీల గురించి సాక్ష్యాధారాలను సేకరిం చేందుకు గడువు అవసరమని పీపీ వివరించారు.మొత్తం తొమ్మిది మందిని కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కోర్టును కోరారు.