రాజన్న సిరిసిల్ల, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నిరుడు స్వచ్ఛ సర్వేక్షణ్లో జా తీయ స్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జి ల్లా.. ఈ ఏడాది ఆస్తి పన్ను వసూలులో రా ష్ట్రంలోనే నంబర్వన్గా నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పన్ను చెల్లించడంలో జిల్లా ప్రజలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. 40 రోజుల గడువులో కార్యదర్శులంతా శ్రమించారు. వ్యవసాయ పొలాల్లో ఉన్న యాజమానుల వద్దకు వెళ్లి ఇంటింటికీ తిరిగి పన్ను వసూలు చేశారు.
డీపీవో వీరబుచ్చయ్య పర్యవేక్షణలో 255 మంది కార్యదర్శులు పన్ను వసూళ్లలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా రూ.7.5 కోట్ల ఆస్తిపన్ను బకాయిలుండగా.. నిర్దేశిత లక్ష్యం మేరకు రూ.6.92 కోట్లు వసూలు చేశారు. 98.19 శాతంతో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో నంబర్వన్ స్థానంలో నిలిచింది. 97.67 శాతంతో జగిత్యాల రెండో స్థానం, 97.30 శాతంతో సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో చందుర్తి, కోనరావుపేట, ఇల్లంతకుంట, రుద్రంగి, వేములవాడ రూరల్, వేములవాడ మండలాలు 100 శాతం, బోయినపల్లి 99, ముస్తాబాద్ 98, గంభీరావుపేట 98, ఎల్లారెడ్డిపేట 98, తంగళ్లపల్లి 96, కోనరావుపేట 96 శాతం చొప్పున ఆస్తి పన్ను వసూలు చేశాయి.