సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న చిత్రాన్ని చేనేత వస్త్రంపై రూపొందించాడు. ఏడు రోజులు శ్రమించి రెండు మీటర్ల వస్త్రంపై దీనిని తీర్చిదిద్దాడు.
గతంలో జీ-20లోగోతో రూపొందించిన వస్ర్తాన్ని ప్రధాని మోదీకి పంపాడు. అవకాశం కల్పిస్తే ప్రధాని మోదీని స్వయంగా కలిసి ఈసారి తాను రూపొందించిన ఈ వస్ర్తాన్ని అందిస్తానని హరిప్రసాద్ చెప్పాడు.