రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, టెక్స్టైల్స్పార్కు నుంచి డబుల్బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్ కళాశాల భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని.. ఇందులో భాగంగా సిరిసిల్లలో చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్తోపాటు నర్సింగ్ కళాశాల, అంతర్జాతీయ డైవింగ్స్కూల్ భవనాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని చెప్పారు. సిరిసిల్లలో పద్మశాలీ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సిరిసిల్ల డబుల్ బెడ్రూం ఇండ్లను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్లో ఇండ్లను నిర్మిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
జూలై మొదటివారంలో నీటి విడుదల
జూలై మొదటివారంలో ఎగువమానేరు నీటిని విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి వర్షాకాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని 13 వేల ఎకరాలకు ఎగువమానేరు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వర జలాలతో వేసవిలోనే నిండిన అప్పర్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీటి నిలువ ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానకాలం పం టకు నీళ్లు వచ్చినందుకు సిరిసిల్ల రైతాంగం పక్షాన ముఖ్యమంత్రికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.