హైదరాబాద్, జూన్ 30,( నమస్తే తెలంగాణ ): ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఓటు హక్కు పొందడానికి చట్టబద్ధమైన అవకాశం ఉన్నపుడు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయదని తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ కుతుబుద్దీన్మసూద్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితా నుంచి పిటిషనర్ తోపాటు కుటుంబసభ్యుల ఓట్లను తొలగించడంతో 2024 ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించలేకపోయినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లను పునరుద్ధరించకపోతే సర్ కార్యక్రమంలో తమ దరఖాస్తులను స్వీకరించకుండా తిరసరించే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ సర్ కార్యక్రమంలో పేర్లు పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పారు. వాదనలను విన్న బెంచ్ చట్టపరమైన విధానం సర్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేరొంది. బీఎల్వోలకు వివరాలు సమర్పిస్తే పేర్లను తిరిగి చేర్చడానికి అవకాశం ఉందని, ఒకవేళ ఓటర్ల జాబితాలో చేర్చకపోతే ఎన్నికల అధికారులను ఆశ్రయించాలని, అప్పటికీ చర్యలు లేకపోతే చట్టప్రకారం కోర్టును ఆశ్రయించవచ్చంటూ పిటిషన్పై విచారణను ముగించింది.