వనపర్తి, జూలై 17 (నమస్తే తెలంగాణ) : సర్ ప్రక్రియ పొడిగింపులో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లితోపాటు పలు గ్రామాల్లో సర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలకు ఆయన దిశానిర్దే శం చేశారు.
బీఎల్వోలతో సమన్వయం చే సుకుంటూ సర్లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన తేజేశ్వర్ ఐఐటీలో 792వ ర్యాంక్ సాధించగా.. శాలువాతో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సన్మానించారు.