హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో ‘యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందన’ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో వ్యవసాయం కోసం రూ.379 లక్షల కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. కేంద్రం బాధ్యతారాహిత్యంతో చేతులెత్తేసినా, సొంత నిధులతో వడ్లు కొనుగోలు చేయాలని సీఎం కే సీఆర్ గొప్ప నిర్ణయం తీసుకొన్నారని కొనియాడారు.
ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న తెలంగాణ, టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో దేశానికే అ న్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో 1.25 కోట్ల ఎకరాల భూమికి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశ సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 2.93 శాతం నుంచి 4.64 శాతానికి చేరుకొన్నదని వివరించారు. హర్యానాలో అదానీ కంపెనీ కోసం బీజేపీ ప్రభుత్వం రైతులు ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కంపెనీ సమీపంలో పండిన వరిధాన్యాన్ని కొనకుండా ఎఫ్సీఐ డీవో లెటర్ జారీ చేసిందని ఆరోపించారు.
ఎనిమిదేండ్లలో సాగుకు 3.79 లక్షల కోట్లు
రాష్ట్రంలో వ్యవసాయం పండుగ
పెట్టుబడిదారులకు అండగా కేంద్రం
ప్లీనరీలో వడ్ల సేకరణను ప్రశంసిస్తూ మంత్రి నిరంజన్రెడ్డి తీర్మానం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో ‘యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందన’ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో వ్యవసాయం కోసం రూ.379 లక్షల కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. కేంద్రం బాధ్యతారాహిత్యంతో చేతులెత్తేసినా, సొంత నిధులతో వడ్లు కొనుగోలు చేయాలని సీఎం కే సీఆర్ గొప్ప నిర్ణయం తీసుకొన్నారని కొనియాడారు.
అన్నపూర్ణగా తెలంగాణ
ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న తెలంగాణ, టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో దేశానికే అ న్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో 1.25 కోట్ల ఎకరాల భూమికి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశ సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 2.93 శాతం నుంచి 4.64 శాతానికి చేరుకొన్నదని వివరించారు. హర్యానాలో అదానీ కంపెనీ కోసం బీజేపీ ప్రభుత్వం రైతులు ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కంపెనీ సమీపంలో పండిన వరిధాన్యాన్ని కొనకుండా ఎఫ్సీఐ డీవో లెటర్ జారీ చేసిందని ఆరోపించారు.