వనపర్తి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యం కరువైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ అన్నివర్గాలను తీవ్రంగా నిరాశ పరిచిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు గంగలో కలిశాయని ఎద్దేవాచేశారు. రైతు భరోసా వచ్చిన వాళ్లకే రైతుబీమా అంటూ మెలికలు పెడుతున్నారని మండిపడ్డారు.