భూపాలపల్లి : తెలంగాణలోని సింగరేణి గనులను(Singareni mines) ప్రైవేట్పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పకొట్టేందుకు ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli ) పిలుపునిచ్చారు. భూపాలపల్లి(Bhupalli)లో చేపట్టిన మహాధర్నా(Mahadarna) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.
పార్లమెంట్లో అన్ని బిల్లులకు బీఆర్ఎస్(BRS) సహకరించలేదా? అని ప్రశ్నించారు.రైతులకు, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని విధాన పరంగా కేంద్రాన్నివ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రైతులను ముంచి ఆదానీ(Adani), అంబానీ(Ambani)లకు దోచి పెడితే తామేందుకు సహకరించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు సపోర్ట్ చేయాలా?అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, కేటీఆర్(KTR), కవిత(Kavitha) ప్రజల కోసం, తెలంగాణ కోసం జైలుకు పోయారని పేర్కొన్నారు.
మొన్న మత విద్వేషాలు,నిన్న పేపర్ లీకులు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయడంతో సీఎం కేసీఆర్ వాటిని తెలివిగా తిప్పికొట్టారని తెలిపారు. నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేశారని, విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తుందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. లాభాల బాటలో పయనిస్తున్నసింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులను ప్రైవేట్పరం చేసేందుకు యత్నిస్తుందని ఆరోపించారు.
దేశ సంపదను దోస్తులకు పంచిపెడుతున్నారు :మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను ప్రజల అభివృద్ధికి పంచుతుంటే నరేంద్ర మోదీ దేశ సంపదను దోస్తులకు దోచి పెడుతున్నాడని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్రానికి సహకరించడం లేదని చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు.
తెలంగాణను విచ్ఛినం చేయడానికి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.బండి సంజయ్ పేపర్ లీక్కు పాల్పడి జైలుకు వెళితే ఆయన్ను మందలించాల్సింది పోయి, అభినందిస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని వెల్లడించారు.