హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల కోరిక మేరకు సింగరేణిలో మరింత సన్నని బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లపై సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, సీహెచ్పీల ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న 10 ప్ర ధాన సీహెచ్సీలు, గనుల వద్ద ఉన్న 16 పిట్ హెడ్ సీహెచ్పీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సింగరేణిలో 250 ఎంఎం కన్నా తక్కు వ సైజు బొగ్గును రవాణా చేస్తున్నామని తెలిపారు. అదికూడా 80 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా అవుతున్నదని చెప్పారు. విద్యుత్తు సంస్థల్లో కొందరు తమకు 100 ఎంఎం కన్నా తక్కువ సైజు గల బొగ్గు కావాలని కోరుతున్నారని చెప్పారు. అందుకే.. సిం గరేణిలో ఇకపై సన్నని బొగ్గు ఉత్పత్తికి ఏర్పా ట్లు చేయాలని సూచించారు.
సీహెచ్పీలలో దీనికి కావాల్సిన మార్పులు చేయాలని ఆదేశించారు. దీనివల్ల సింగరేణికి అదనపు ఆదా యం చేకూరుతుందని చెప్పారు. సింగరేణి సంస్థ మరో రెండేండ్లలో 85 మిలియన్ ట న్నుల బొగ్గు ఉత్పత్తి రవాణాను లక్ష్యంగా పె ట్టుకున్న నేపథ్యంలో బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సీహెచ్పీల లోడింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుత 109 మిలియన్ టన్నునుంచి 133 మిలియన్ టన్నులకు పెంచాలన్నారు. ఈ ఏడాది 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉ త్పత్తి లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. మందమర్రి వద్ద 130 కోట్లతో రైల్వే సైడింగ్, సీహెచ్పీలు నిర్మించనున్నట్టు తెలిపారు. స మావేశంలో సింగరేణి డైరెక్టర్లు బలరామ్, డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డి, అడ్వయిజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్రపాండే, ఈడీ జే ఆల్విన్, జీఎంలు ఎం సురేశ్, సీహెచ్ నరసింహరావు, కే సూర్యనారాయణ, కే కొండయ్య, స్వామినాయుడు, వైజీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.