హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ను పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. సోమవారం హైదరాబాద్లో సంఘం అధ్యక్షుడు దండంరాజు రామచందర్రావు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఇస్తున్న అరకొర పెన్షన్ సరిపోవడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత అపరిమిత వైద్య సదుపాయాలను అందించాలని కోరారు.