హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కం పెనీ ఈ ఆర్థిక సం వత్సరం తొలి నెలలో 60 లక్షల టన్నుల బొగ్గు రవా ణా చేసి.. గత ఏడాది ఏప్రిల్ కన్నా 5.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. అలాగే బొగ్గు ఉత్పత్తిలో 4.7 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 12.6 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఏరియా జనరల్ మేనేజర్లతో సీఎండీ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు
. ఈ సందర్భంగా మే నెలలో సాధించాల్సిన లక్ష్యాలను ఏరియా జనరల్ మేనేజర్లకు నిర్దేశించారు. ఏప్రిల్ నెలలో నిర్దేశించిన 55.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మే నెలలో 67.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, దీని కోసం రోజుకు కనీసం 2.20 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే రోజుకు కనీసం 2.26 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు సంసిద్ధం కావాలని సూచించారు.