హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం శ్రీధర్ను సింగరేణి సీఎండీగా నియమించింది. శ్రీధర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి నష్టాలలో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి అభివృద్ధికి శ్రీధర్ చేస్తున్న కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ మరో ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీధర్ పదవీ కాలాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ శుక్రవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.