రామగుండం: సింగరేణి (Singareni) సీఎండీ బలరాం నాయక్ (CMD Balaram Naik) కార్మికులతో కలిసి క్యాంటీన్లో టిఫిన్ చేశారు. ఇటీవలే సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం నాయక్.. తొలిసారిగా రామగుండంలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం జీడీకే-2 బొగ్గు గనిని పరిశీలించిన ఆయన.. క్యాంటీన్లో కార్మికులతో కలిసి టిఫిన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎన్ బలరాం ఈ నెల 2న నియమితులయ్యారు. అప్పటివరకు సీఎండీగా ఉన్న ఎన్ శ్రీధర్ను ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.