హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలోని తార్నాక లో రూ. 84 లక్షలతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రంథాలయాలను పట్టించుకోలేదని అన్నారు. అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని వసతులతో గ్రంథాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు కావలసిన పుస్తకాలను,అన్నపూర్ణ భోజనం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.
నగరంలో 14 గ్రంథాలయాలు మంజూరు కాగా వీటీలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లు శ్రీధర్, ప్రసన్నతదితరులు పాల్గొన్నారు.