హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్, ఆగస్టు 31: టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన సంఘటన బయటపడింది. దీనిపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నది. ఐటీసీలో సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాద్రి-కొత్తగూ డెం జిల్లాకు చెందిన మాడపాటి రాజశేఖర్కు టీఎస్జెన్కో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని తోటి కార్మికుడు ప్రవీణ్ నమ్మబలికాడు. దానికిగానూ రాజశేఖర్ రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొన్నాడు. ఈ మేరకు ఈ నెల 29న ప్రవీణ్ అతనికి అపాయింట్మెంట్ కోసమంటూ ఓ లెటర్ ఇచ్చాడు. దానిపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ సంతకం సైతం ఉన్నది.
దాన్ని తీసుకొని ఉద్యోగం కోసం రాజశేఖర్ విద్యుత్తు సౌధకు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం ది. రంగంలోకి దిగిన విద్యుత్తు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా, సీఎండీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ మేరకు ఖైరతాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి ఓ వ్యక్తి నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన ఘటనపై సీఎండీ ప్రభాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని, విద్యుత్తు సంస్థలో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు
చేయాలని సూచించారు.