వికారాబాద్ : ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని(Ganesh idol) ధ్వంసం(Destroyed) చేశాడు. ఈ సంఘటన వికారాబాద్(Vikarabad) జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనిలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి (SI Madhusudan Reddy) మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. స్థానికులతో వాగ్వాదానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందు ధర్మాన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ
వికారాబాద్ – పూడూర్ మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనిలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు.
హిందు ధర్మన్ని, దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్… pic.twitter.com/9Gbg3rXVIV
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2024