మొగుళ్లపల్లి, మార్చి 5: జయశంకర్ జిల్లాలోని ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో ఓ రౌడీషీటర్కు జన్మదిన వేడుకలు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిట్యాల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం రౌడీషీటర్ జన్మదినం జరిపారు. రౌడీషీటర్తోపాటు మరికొందరు కేక్తో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రౌడీషీటర్ ఎస్సై సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో అంతా కలిసి వేడుకలు జరుపుకోగా, కొందరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఓ పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని పిలిపించి తీవ్రంగా మందలించినట్టు సమాచారం. కాగా.. అతను రైడీషీటర్ అనే విషయం తనకు తెలియదని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలిసింది.