హైదరాబాద్, ఏప్రిల్ 01 : గత రెండేళ్లుగా కరోనా కష్టాలు పడుతున్న ప్రజలకు శుభాలను ఇచ్చే శుభకృత్ నామ సంవత్సరం వచ్చిందని, కష్టాల నుంచి బయటపడి ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని, వీటి ఫలితాలు ప్రజల కళ్లముందు ఉన్నాయన్నారు.
సీఎం కేసీఆర్ ఈ శుభకృత నామ సంవత్సరాన్ని సార్ధక నామ సంవత్సరంగా చేసేందుకు 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తూ 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించారని తెలిపారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.