యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagiri Gutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో శుక్రవారం నుంచి శ్రీ సీతారామ చంద్రస్వామి వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వ తేదీ వరకు జరుగనున్న ఉత్సవాలు అనుబంధ శివాలయంలో అత్యత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు(Temple Organizers) వెల్లడించారు.
ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం శ్రీ సీతారామ హనుమత్ మూలమంత్ర జపాలు, దశశాంతి పంచాసూక్త పారాయణంతో అభిషేకాలు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. ఆలయ సిద్ధాంతి, ప్రధానార్చకులు , అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.