Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
☞ సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ
☞ వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్)
☞ వారంలో పనిగంటలు
☞ ఓవర్టైమ్ వేజెస్
☞ జాతీయసెలవు దినాల్లో పనిచేసిన సిబ్బందికి పరిహారంగా వేతనం చెల్లింపు
☞ మహిళా ఉద్యోగుల రక్షణా ఏర్పాట్లు
☞ ఉద్యోగుల సమ్మతితోనే నైట్డ్యూటీలు వేయాలి
☞ నైట్డ్యూటీలు చేసే మహిళా ఉద్యోగులకు రానుపోనూ రవాణా సదుపాయం
☞ 24/7 పనిచేసే ప్రతి సంస్థ రూ. 10 వేలు వార్షిక రుసుం చెల్లించాలి
☞ సిబ్బందికి చట్టప్రకారం ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించాలి.