నిజామాబాద్ : జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో.. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం పెరిగింది. గోదావరి నదిలో గల పురాతన శివాలయం నీట మునిగిపోయింది. నిన్నటి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. దీంతో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది.